Trending : లైట్ ఆన్ చేయడమే ఉద్యోగం.. జీతం రూ. 30 కోట్లు.. వెంటనే కావలెను !

by Javid Pasha |
Trending : లైట్ ఆన్ చేయడమే ఉద్యోగం.. జీతం రూ. 30 కోట్లు.. వెంటనే కావలెను !
X

దిశ, ఫీచర్స్ : జీవితంలో సంతోషంగా బతకాలంటే కావాల్సిన కనీస అవసరాల్లో ఉద్యోగం ఒకటి. ప్రపంచ వ్యాప్తంగా అనేక రకాల జాబ్స్ ఉన్నప్పటికీ, నిరుద్యోగం కూడా ఉంటోంది. అందుకే కొన్నిసార్లు తక్కువ జీతమైనా సరే చేస్తామంటూ ముందుకొచ్చేవారు చాలా మందే ఉంటారు. నెలకు రూ. 15 నుంచి 30 వేల సాలరీ వచ్చినా సరే ఒక్కోసారి ఫుల్ డిమాండ్ ఉంటుంది. అలాంటిది ఒక దగ్గర రూ. 30 కోట్లు ఇస్తామంటే కూడా ఎవరూ ముందుకు రావడం లేదు. కారణాలేమిటో చూద్దాం.

అంతపెద్ద మొత్తంలో సాలరీ ఇస్తారంటే.. డ్యూటీ ఏ దట్టమైన అడవుల్లోనో అయి ఉంటుందని అనుకుంటే పొరపాటే.. అలాంటిదేం లేదు. అయినా జనాలు భయపడుతున్నారు. కారణం ఏంటంటే.. ఆ ఉద్యో్గం చేయాల్సిన ప్లేస్ ఈజిప్ట్ సముద్రంలోని పోర్ట్ ఆఫ్ అలెగ్జాండ్రాలోని ఫారోస్ లైట్ హౌస్‌. ఇక్కడ ఎల్లప్పుడూ లైట్ ఆన్‌లోనే ఉండేలా చూసుకోవడానికి, అవసరమైతే స్విచ్ ఆన్ ఆఫ్ చేయడానికి ఒక ఉద్యోగి కావాలని నిర్వాహకులు కోరుతున్నారు. ఇంతకు మించి అక్కడ మరోపని ఉండదు. అలా చేయాలని, ఇలా చేయకూడదని కూడా ఎవరూ ఒత్తిడి చేయరు. ఫోన్లు కూడా చేయరు. జీతం మాత్రం ఏడాదికి రూ. 30 కోట్లు తప్పకుండా ఇస్తారు. అయినా ఎవరూ ఆసక్తి చూపట్లేదు. వర్క్ ప్లేస్ సముద్రం మధ్యలో ఉండటం, రాత్రింబవళ్లు లైట్ ఆగిపోకుండా చూసుకునే ఉద్యోగి తప్ప ఇంకెవరూ అక్కడ ఉండకపోవడమే ఇందుకు కారణం. పైగా సముద్రపు అలలు ఎగసి పడుతుంటాయి. ఒక్కోసారి హోరు గాలులు వీస్తుంటాయి. భయం వేసినా, సంతోషం అనిపించినా చెప్పుకోవడానికి ఎవరూ ఉండరు. అంటే ఒంటరిగానే ఉండాల్సి వస్తుంది. దీంతో సంవత్సరానికి రూ. 30 కోట్లు ఇస్తామన్నా ఆ ఉద్యోగం చేసేందుకు ఎవరూ ఇంట్రెస్ట్ చూపడం లేదు.

పోర్ట్ ఆఫ్ అలెగ్జాండ్రాలోని ఫారోస్ లైట్ హౌస్‌ అక్కడ చాలా ముఖ్యమని నిపుణులు చెప్తున్నారు. ఎందుకంటే సముద్రంలోని ఈ ఏరియాకు నౌకలు రాకుండా వార్నింగ్ సిగ్నల్ ఇచ్చేందుకు దానిని నిర్మించారు. ఈ ప్రాంతంలో పెద్ద పెద్ద రాళ్లు ఉంటాయిని, అందుకోసం నౌకలు ఆ వైపు వస్తే డ్యామేజ్ అవుతాయని చెప్తుంటారు. ఈ హెచ్చరిక జారీకోసమే అక్కడ లైట్ ఎల్లప్పుడూ వెలుగుతూనే ఉండాలి. ఒకవేళ అది నీళ్లల్లో మునిగిపోతుందనే భయం కూడా లేదు. అలా జరిగే అవకాశం ఉంటే సముద్రయాన సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకొని కాపాడుతారు. కాకపోతే ఒంటరిగా ఉండాల్సి వస్తుందనే ఆ ఉద్యోగం చేయడానికి ఎవరూ ముందుకు రావడం లేదని అధికారులు చెప్తున్నారు. ఇప్పటికీ ఖాళీగానే ఉందని, ఒక ఎంప్లాయి వెంటనే కావాలని, ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చని కోరుతున్నారు. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్ అవుతుండగా.. పలువురు క్యూరియాసిటీతో రకరకాలుగా స్పందిస్తున్నారు.

Read More..

Egyptian pyramids: ఈజిప్టు పిరమిడ్ల చుట్టూ వింత బుడగలు.. గ్రహంతర వాసుల పనేనా?

Advertisement

Next Story

Most Viewed